Listen to this article

జనం న్యూస్ 04 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

సింహాచలం దుర్ధటనపై మంత్రుల కమిటీ బాధ్యత వహించాలని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. భీమిలిలో శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. చందనోత్సవంలో భాగంగా ముందుగానే మంత్రుల కమిటీ ఆలయంలో పర్యటించచిందన్నారు. 4 రోజుల క్రితమే గోడ నిర్మాణం జరిగిందన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని అన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.