Listen to this article

జనం న్యూస్:5 మే సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్:

అందమైన చేతిరాత అందరికీ సాధ్యమే” పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకు ఎంతో అవసరం.
ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాస్ అహ్మద్ కేజీ టు పీజీ వరకు లక్షలాది మంది విద్యార్థుల రాత మారుస్తునే ఉంది…ఈ పుస్తకం150 కంటే ఎక్కువసార్లు ముద్రించబడింది. ముఖ్యమంత్రులు, అధికారులు, సుప్రీంకోర్టుమాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ , తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ లకు అందజేయడం జరిగింది. ఎజాస్ అహ్మద్ ఆదిత్య విద్యాలయంలో శిశు తరగతికి తెలుగు పాఠాలు బోధిస్తున్నప్పుడు వచ్చిన ఆలోచనలను పుస్తక రూపంలో ముద్రిద్దామని తపనపడి ముద్రణకు పైసలు లేక శ్రీనివాస బల్దావాకు తెలుగు ట్యూషన్ చెప్పి అచ్చు వేద్దామనుకుంటే విధి వక్రీకరించి, ఆయన సతీమణితో సహా స్వర్గస్థులైనారు. ఈ విషయం ఆత్మీయ మిత్రులు దేశపతి శ్రీనివాస శర్మ చెవిలో వేస్తే ఆయన సంగీత ఉత్సవాలలో స్వర్గీయ శివానందమూర్తి ఆర్థిక సహాయంతో ముద్రించి మొదటి పుస్తకాన్ని, స్వర్గీయ గాయకులు బాలసుబ్రమణ్యం సంతకం చేసి ఇచ్చిన పుస్తకాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, డాక్టర్ రామచందర్ రావు, కెప్టెన్ లక్ష్మికాంతరావు, స్వర్గీయ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. శివానందమూర్తి 20 పుస్తకాలు తెప్పించుకొని బహుమతి పురస్కారంగా 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉత్తరం రాయడం జరిగింది. తదుపరి సిద్దిపేట మొదటి ఎమ్మెల్యే, స్వాతంత్ర్య సమరయోధులు గురువారెడ్డి 25 వేల ఆర్థిక సాయంతో రెండవ ముద్రణ, ఇప్పటి లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్ నాథ్ సూచన మేరకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు 28వేల ఆర్థిక సాయంతో మూడవ ముద్రణ, సిద్దిపేట గురుకృప, ప్రతిభ కళాశాలల ఆర్థిక సాయంతో, కవి కైలాస్ పతిరావు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్పీ ఇక్భాల్ అహ్మద్, వ్యాపారస్తులు పారిపల్లి వెంకటేశం, ఇల్లందుల అంజయ్య లాంటి అనేక మంది దాతలతో ముద్రించి వేలాది మంది విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, అప్పటి ఉపముఖ్యమంత్రి, ఇప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతికి అందించి పిల్లలకు పంపిణీ చేయమని కోరడం జరిగింది. సీపీఎం నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, కేఎల్ మహిద్ర, కనపర్తి రామచంద్రచార్యులు, వెంకట్రాంరెడ్డి, సిరిసిల్ల ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే బొమ్మగారి ధర్మభిక్షం, బద్దం సుజాత, సీపీఎం కార్యదర్శి నారాయణ, ప్రతాప్ రెడ్డి, 25 మంది స్వాతంత్ర్య సమరయోధుల సమక్షంలో హైదరాబాద్ లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2005 లో 50 ప్రతులు కొనుగోలు చేసి అక్షర సౌష్టవాన్ని విద్యార్థులకు తెలియజేశారు. శ్రీకృష్ణ కమీషన్ తెలంగాణ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణకు చిన్నగుండవెల్లికి వచ్చినప్పుడు న్యాయమూర్తి కృష్ణ ఈ పుస్తకాన్ని పరిశీలించి చేవ్రాలు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలోని 16 కేజీబీవీ పాఠశాలల్లోని విద్యార్థినులకు అప్పటి జి సి టి ఓ అనురాధ ముద్రించి అందించి అందరి రాత మార్చడం జరిగింది. అప్పటి సోషల్ వెల్ఫేర్ పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలోని అన్ని సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలోని అందరు విద్యార్థులకు డిఫరెంట్ స్టోక్స్ సంస్థ ద్వారా అందించి రాత మార్చడం జరిగింది. ఈ పుస్తకం ద్వారా సిద్ధిపేట శుభోదయ విద్యాలయంలోని 1200 వందల మంది విద్యార్థుల రాత మూడు భాషలలో ఒకే మాదిరిగా రాయించి కలెక్టర్లు, డీఈవోలు, అధికారులందరికీ ఆశ్చర్య చకితులను చేయడం జరిగింది. ఇప్పటికీ గజ్వేల్ లోని జి డిఆర్ పాఠశాలలో ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు ఒకే విధంగా రాసేలాగా శిక్షణ ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ పుస్తకాన్ని ప్రవేశపెట్టి పిల్లల రాత మారుస్తున్నారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ గాజువాక పాఠశాలలో పుస్తక పరిచయం, రాసే విధానంపై వీడియోలు తీసి ఆనంద్ మహేంద్ర నేతృత్వంలో నన్హికలి అనే సంస్థ వారు వేలమంది విద్యార్థులకు సి డి లు పంపిణీ చేశారు. ఎజాస్ అహ్మద్1994నుండి వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి ఈ పుస్తకం ద్వారా వేల మంది విద్యార్థుల రాత మారుస్తూనే ఉన్నారు. ఎస్సీఆర్టీ వారు ఈ పుస్తకాన్ని ఆధారం చేసుకొని 10 ఎపిసోడ్లు ఎజాస్ అహ్మద్ తరగతులను టీ వీ లో ప్రసారం చేశారు.మెదక్ జిల్లాలోని పి ఏం శ్రీ పాఠశాలలో దీనిని ప్రవేశపెట్టి రాతపై మూడు భాషలలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇప్పటి వరకు 260 కి పైన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో వెల్లి ఈ పుస్తకాన్ని పరిచయం చేసి రాత మార్చడం జరిగింది. ఈ పుస్తకానికి సిఈడి ఫౌండేషన్ వారు ఢిల్లీలో జాతీయ పురస్కారం అందించారు. తెలుగు యూనివర్సిటీ వారు కీర్తి పురస్కారం అందించారు. అనేక పాఠశాలలకు ఈ పుస్తకం అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే పరిశీలించి, పరిశోధించి రచయితకు తగిన పారితోషకం ఇచ్చి ముద్రించి అన్ని పాఠశాలలకు ఇస్తే తెలుగు రాష్ట్రాలలోని అందరు విద్యార్థుల రాత ఒకే విధంగా అందంగా ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఇటీవల రచయిత ఎజాస్ అహ్మద్ కు ఉగాది పురస్కారం అందించి ఈ పుస్తకాన్ని పరిశీలించి అభినందించారు.