Listen to this article

పాల్గొన్న ప్రజా ప్రతినిధులు

జనం న్యూస్ మే 05 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం

అమీన్పూర్ మండల పరిధిలో గల ఐలాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం ఘనంగా కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక అలంకరణలతో వేదికను ఏర్పాటు చేశారు. అమ్మవారికి మహాలక్ష్మి అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఒగ్గు కళాకారులచే స్వామివారి కథలు ,ఒగ్గు కళాకారుల విన్యాసాలు శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులతో ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాల సమర్పించుకొని కోరికలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్ చేరు బిఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, బిఆర్ఎస్ ఐలాపూర్ మాణిక్ యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ బ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని భక్తులకు కోరిన కోరికల కు కొంగుబంగారమై నిలవాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.