Listen to this article

జనం న్యూస్ మే 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా కూకట్ పల్లి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన పాదయాత్రలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు,జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, భారత్‌లో గడువు ముగిసినప్పటికీ ఇంకా అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీ,బాంగ్లాదేశీ మరియు రోహింగ్యా వలసదారులను వెంటనే దేశం విడిచిపోవాలని డిమాండ్ చేస్తూ, దేశ భద్రతతో కూడిన అంశాల్లో ఎలాంటి రాజీ లేదని, అక్రమ వలసదారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ. ఉగ్రవాదం,దేశం విడిచి వెళ్ళిపోయే వరకు అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందనీ వడ్డేపల్లి రాజేశ్వరరావు తెలియజేశారు.మేడ్చల్ జిల్లా అర్బన్ బిజెపి అధ్యక్షుడు ఎస్ . మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి అసెంబ్లీ ఇన్చార్జ్ మాధవరం కాంతారావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయినేని సూర్యప్రకాష్ రావు,అర్శనపల్లి సూర్యారావు,జిల్లా ప్రధాన కార్యదర్శి యంజల పద్మయ్య,అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, మూసాపేట్ డివిజన్ కార్పొరేటర్ కోడిచేర్ల మహేందర్, రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ మరియు డివిజన్ స్థాయి బీజేపీ, బీజేవైయం నాయకులు, కార్యకర్తలు, మోర్చాల విభాగాల ప్రతినిధులు , తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, మద్దతుదారులు కూడ విశేషంగా స్పందించారు.