Listen to this article

జనం న్యూస్ మే 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

మంచిని మైకులో చెప్పమన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజోప కార్యక్రమాలను ప్రజల్లోకి తీసు కెళ్ళి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. సోమవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం మరియు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమo అల్వాల్ సర్కిల్ విబిఆర్ గార్డెన్స్ లో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఎన్నికల సందర్భంగా హమీ ఇచ్చిన వాటిని, ఇవ్వని వాటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలది అన్నారు రాజ్యాంగం మూల స్వరూపాన్ని మార్చాలని చూడడం దారుణమని దీనికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించబోదని రమేష్ పేర్కొన్నారు.