Listen to this article

జనం న్యూస్ మే 05:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలంలోనిగుమ్మిర్యాల్,ఏర్గట్ల గ్రామలలో ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతుల నమోదు కార్యక్రమం ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానంలో ప్రారంభించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని మీ గ్రామాలకు వచ్చే ముందు మీకు సమాచారం ఇచ్చి రిజిస్ట్రీ చేస్తామని అన్నారు.ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా ప్రతి రైతుకి 11 అంకెల గుర్తింపు సంఖ్య తో గుర్తింపు కార్డులు ఇస్తారని ఇవి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల అమలు కోసం ఉపయోగ పడుతుందని తెలిపారు. కావున రైతు సోదరులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రక్రియ కోసం రైతులు తమ వెంట ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్, మొబైల్, తీసుకొని వెళ్లి వ్యవసాయ విస్తరణ అధికారి ని సంప్రదించాలని తెలిపారు