

మార్క్సిజమే ప్రపంచ మానవాళికి దిక్సూచి
అన్యాయం, అవినతి, దోపిడి నిర్మూళన మార్క్సిజంతోనే సాధ్యం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేన
సిపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కార్ల్ మర్క్స్ 207వ జయంతి
జనం న్యూస్ 05 మే( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ )
కొత్తగూడెం : పెట్టుబడి దారులకు సాగిస్తున్న దోపిడికి వ్యతిరేకంగా కార్మికులు, కష్టజీవులను ఏకం చేసే సిద్ధాంతాన్ని రూపకల్పన చేసి, మానవ శ్రమకు విలువ చేకూర్చిన మహామేధావి కార్ల్ మర్క్స్ అని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మార్క్ 207వ జయంతిని పురస్కరించుకొని శేషగిరిభవన్లో సోమవారం మార్క్స్ చిత్రపఠానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ మానవ శ్రమకు విలువ లేని పరిస్థితుల్లో శ్రమైక జీవులకు పని గంటలు, శ్రమకు తగిన వేతనం కోసం ఆయన చేసిన కృషి ప్రపంచ కార్మిక వర్గానికి తోడ్పాటును అందించిందన్నారు. సమాజ చరిత్ర అంతా వర్గపోరుతోనే ముడిపడి ఉంటుందని, ఈ వర్గపోరే అంతిమ విజయం సాధిస్తుందని చెప్పిన మహా మేదావి, మానవతావాది మార్క్స్ అని కొనియాడారు. మార్క్సిజం ప్రపంచ మానవాలికి దిక్సూచి వంటిదని, అన్యాయం, దోపిడి, అవినీతి నిర్మూటించబడాలంటే మార్క్సిజానికి అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలని సూచించారు. కమ్యూనిస్టు పార్టీలకు కలం చెల్లిందన్న వారికి చైనా విప్లవం సరైన సమాధానం చెప్పిందని, చైనా, క్యూబా, వియత్నాం వంటి దేశాలు సోసిలిస్టు మార్గంలో ముందుకు పోతున్నాయన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంత కర్తగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మార్క్స్ అడుగుజాడల్లో నేటితరం కమ్యూనిస్టులు డుచుకోవాలని, తద్వారా కమ్యూనిజాన్ని మరింతగా విస్తరింపచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరిమి రాజ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, భూక్యా శ్రీనివాస్, కె రత్నకుమారి, ఎస్ కె ఫహీమ్, నూనావత్ గోవిందు, గుత్తుల శ్రీనివాస్, దారా శ్రీనివాస్, గొనె మని, సురేష్, లక్ష్మీనారాయణ ధనలక్ష్మి, దార లక్ష్మి, అక్తర్, శాంతి తదితరులు పాల్గొన్నారు.