Listen to this article

జనం న్యూస్ మే 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం


ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా ఎంపిక చేయాలని పేదవారికి నిలువ నీడ లేని వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలని బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్)ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్ వినతి పత్రం ద్వారా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కి తెలియజేశారు ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ముఖ్యంగా శాయంపేట మండలంలోని వివిధ గ్రామాలలో నిరుపేద ప్రజలకు,ఇల్లు లేని వారికి, ఇతర ఇళ్లలో అద్దెకు ఉండేవారికి,ఇల్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ ని కోరారు అధికార పార్టీ నాయకులు అర్హత కలిగిన పేదవారికి కాకుండా వారికి సంబంధించిన అనుకూలమైన వ్యక్తులకు ఈ పథకం వర్తింపజేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు అధికారులు శాయంపేట మండలంలోని అన్ని గ్రామాలను సమగ్రంగా సందర్శించి ఇందులో ఎవరు ఈ పథకం కు అర్హత కలిగి ఉన్నారో గుర్తించి వారికి మాత్రమే ప్రాధాన్యం కల్పించాలని కోరారు. పేదలకి, గూడు లేని వారికి మొదటి విడతలో అవకాశం తప్పకుండా కల్పించాలని, లేకపోతే భవిష్యత్తులో పేదవారికి వారి సొంత ఇంటి కల సహకారం కాదని తెలిపారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో ఎలాంటి షరతులు లేకుండా ఇల్లు లేని పేదవారికి, వికలాంగులకు, వితంతువులకు, ఇల్లు కట్టుకునే స్థోమత లేని వారికి మొదటి విడతలో ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ ప్రావిణ్య ను కోరారు…..