

జనం న్యూస్ మే 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
రవాణా తోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రూ.3 526 కోట్ల తో నూతనంగా నిర్మించిన 363తో పాటు కొత్తగా నిర్మించనున్న వంతెనలు, రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, స్థానిక ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, పాల్వాయి హరీష్ బాబులతో కలిసి సోమవారం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు సమీపంలో ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు పీఎం సడక్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను నిర్మిస్తున్నామని, 2014 నుంచి ఇప్పటివరకు 5 వేల వేల కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులను నిర్మిస్తున్నామని,అన్ని రాష్ట్రాలను జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో రెండు లక్షల కోట్లతో రహదారుల విస్తరణ పనులు చేస్తామని, తెలంగాణలో సైతం లక్ష కోట్లతో గ్రీన్ హైవే నిర్మాణానికి శ్రీకారం చుట్టునున్నట్లు చెప్పుకొచ్చారు. రోడ్లతోనే దేశ అభివృద్ధి సైతం ముడిపడి ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సహాయసహకారాలు ఉంటాయని తెలిపారు. గొప్ప చరిత్ర కలిగిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి స్థానిక నాయకులు కృషి చేయాలన్నారు.వ్యవసాయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని. ఉన్న నీటి నిల్వలను పెంచి. స్థానిక రైతుల అభివృద్ధికి పాటుపడాలని ఇందుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉపాధి అవకాశాలు పెరిగి అభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయ పడ్డారు