

జనం న్యూస్, మే 5, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి:
పట్టణంలోని శ్రీ శ్రీనివాస మల్టి స్పెషలిటి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాధభాయ్ అను మహిళకు అత్యవసర చికిత్స నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అవసరం అని పేషెంట్ కుటుంబ సభ్యులు డోనర్ కోసం వెతుకుతూ ఉండగా మెట్పల్లి పట్టణంలోని బార్ అసోసియేషన్*లో విధులు నిర్వహిస్తున్న కర్నాల గౌతమ్ విషయం తెలుసుకొని మెట్పల్లి పట్టణంలోని బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడం జరిగింది.అత్యవసర సమయంలో 6వ సారి రక్తదానం చేసిన గౌతమ్ ని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, వేణుగోపాల్ అడ్వాకేట్ బార్ అసోసియేషన్ సభ్యులు, రక్తదాతల అనుసంధాన కర్త ఉదయ్ కుమారర్, పేషెంట్ బంధువులు, స్నేహితులు అభినందించారు.