

జనం న్యూస్ మే 05 నడిగూడెం
భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీ జాతీయులను వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు బండారు వీరబాబు యాదవ్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ బానోతు ఇందిరా కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదాన్ని పోషిస్తూ పహల్గామ్ ప్రాంతంలో అమాయకపు ప్రజల ప్రాణాల్ని బలితీశారన్నారు.మండల ఉపాధ్యక్షులు మూలం బిక్షం రెడ్డి, నాయకులు చిలకేశ్వరపు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.