

జనం న్యూస్ మే 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో, రైతులకు తిరిగి శిక్షణ కార్యక్రమంలో భాగంగా జరిగే రైతు నేస్తం (వీడియో కాన్ఫరెన్స్) లో భాగంగా నేడు ఉదయం 10 గంటలకు మునగాల మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తనాల కొనుగోలులో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, విత్తనాల నాణ్యత మరియు మొలక శాతం పరీక్ష చేసే విధానం గురించి రైతులకు అవగాహన కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమానికి మునగాల మండలంలో ఆసక్తి గల రైతులు అందరూ హాజరుకావాల్సిందిగా సోమవారం ఒక పత్రిక ప్రకటనలో మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు.