Listen to this article

జనం న్యూస్ 20 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్ నెల్లిమర్ల మిమ్స్‌ వైద్య కళాశాలలో 8685 చదువుతున్న వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్‌ ఆదివారం తన హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ సభ్యుల వేదనకు తానే కారణమవుతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.