Listen to this article

అర్హులని ఇంట్లో కూర్చుని గుర్తిస్తారా…?

ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులకు బాస్ లా ..?

కాంగ్రెస్ పార్టీ పై ఎగరనున్న పేదోడి తిరుగు బాటు జెండా..!

జనం న్యూస్ నడిగూడెం, మే 5

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంత ఇంటి కళ సహకారం చేయాలనే ఉద్దేశం తో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం మండలం లో పైలెట్ ప్రాజెక్టు పేరు తో ఒక గ్రామం లో ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం… మిగతా గ్రామాలలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇండ్లు లేని పేదల ను గుర్తించి వారి జాబితా ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లకు పంపించాలానే ఆదేశాల జారీ చేయడం తో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజలతో సంబంధం లేకుండా గ్రామాలలో పెద్ద నాయకులు వారికి నచ్చిన వారి పేర్లు పంపించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బిఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ది పొందలేదని కాని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులకు,కార్యకర్తలకు పెద్ద పీట వేస్తుందని మరి కొన్ని రోజలలో కాంగ్రెస్ ప్రభుత్వం పై పేదల తిరుగుబాటు జెండా ఎగరవేస్తామని ప్రజలు హెచ్చరింస్తున్నారు. ఇప్పటికైన గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇండ్లు లేని పేదలకు ఇండ్లు మంజూరు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.