Listen to this article

జనం న్యూస్ 06 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

కామ్రేడ్‌ కోరెడ్ల శేషగిరి వర్ధంతి సందర్భంగా “తిరుగులేని కీర్తి సిర’ పుస్తకాన్ని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. సోమవారం విజయనగరంలో ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. శేషగిరి రచనలు సమాజానికి ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో PDF మాజీ MLC కేఎస్‌.లక్ష్మణరావు, స్టేట్‌ UTF కోశాధికారి మోహన్‌ రావు, UTF, CITU నాయకులు పాల్గొన్నారు.