

స్టేషన్ రికార్డులు, హిస్టరీ షీట్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలి.
కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ ఫ్రాడ్స్ గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
యస్.హెచ్.ఒలు వీలైనంత ఎక్కువ సమయం ప్రజలల్లొ ఉంటూ, మన చుట్టూ జరుగుతున్న నేరాల గురించి అవగాహన కల్పించాలి.
యస్.హెచ్.ఒలకు పలు సూచనలు చేసిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ
జనం న్యూస్.మే5.సంగారెడ్డి జిల్లా.ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్)
హత్నూర, గుమ్మడిదల్ల పోలీసు స్టేషన్లను సోమవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ.పరితోష్ పంకజ్ ఐపిఎస్. సందర్శించారు.ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ల పరిసరాలు పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం స్టేషన్ రికార్డులను తనిఖీ చేస్తూ.అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు. ప్రతి వర్టికల్ కు ఒక అధికారిని నియమించి, రికార్డ్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని యస్.హెచ్.ఓలకు సూచనలు చేశారు. ప్రతి కేసులో ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, సిబ్బంది అధికారులు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణలో కృషి చేయాలని అన్నారు. హిస్టరీ షీటర్స్, సస్పెక్ట్స్ మరియు పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, నైట్ బీట్, పెట్రోల్లింగ్ అధికారులు వీధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సిబ్బంది వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని సూచించారు.
మన చుట్టూ జరుగుతున్న ఆన్లైన్ మోసాలు,బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్ గురించి, రోడ్డు ప్రమాదాల గురించి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా జిల్లా ప్రజలల్లొ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం,తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పార్ట్ లు గుర్తించి, సూచిక బోర్డులను ఏర్పాటు చేయించాలన్నారు. యస్.హెచ్.ఒ వీలైనంత ఎక్కువ సమయంలో ప్రజలలో ఉంటూ, ప్రజలతో సత్ సంబంధాలను కలిగి ఉండాలని, మన చుట్టూ జరుగుతున్న నేరాల గురించి అవగాహన కల్పిస్తూ వారిని అప్రమత్తం చేయాలి అన్నారు. విజిబుల్ పోలిసింగ్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ-పెట్టి కేసులు నమోదు చేయాలని యస్.హెచ్.ఒలకు పలు సూచనలు చేశారు.ఆయన వెంట పోలీసుశాఖ అధికారులు. సీఐ.నయీమ్ ఉద్దీన్. హత్నూర ఎస్సై కే శుభాష్. సిబ్బంది ఉన్నారు.
