Listen to this article

జనంన్యూస్. 06.నిజామాబాదు. ప్రతినిధి.

నిజామాబాదు..తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ CET – 2025 కామన్ ఎంట్రెన్స్ పరీక్ష సందర్బంగా అండర్ సెక్షన్ 163 BNS అమలు: పోలీస్ కమిషనర్ వెల్లడి.తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల CET – 2025 లోని జిల్లా లోని అన్ని పరీక్ష కేంద్రాలలో 2025-26 సంవత్సరానికి 1 సంవత్సరం ఇంటర్మీడియట్‌లో ప్రవేశం కోసం 10-05-2025న ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, IPS., నిషేధిత ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
కావున నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ముందస్తు గా నిరోధించాలనే ఉద్దేశ్యంతో నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, IPS., అండర్ సెక్షన్ 163 BNS అమలులో ఉంటుంది అని తెలియచేసారు. అండర్ సెక్షన్ 163 BNS ప్రకారం 1) ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమి కూడరాదు. 2) నిషేదిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరుగవద్దు. 3) అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలోని అన్ని జిరాక్స్ సెంటర్‌లను 10-05-2025 (ఉదయం 07.00 నుండి సాయంత్రం 14:00 గంటల వరకు) మూసివేయాలి. పై నిషేధిత ఉత్తర్వులు 10-05-2025 (ఉదయం 07:00 నుండి సాయంత్రం 14:00 వరకు) అమలులో ఉంటాయి.