Listen to this article

జనం న్యూస్ మే 6 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా


చిలిపి చెడుమండలంలోని ఫైజాబాద్ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ఆనంద్ ఏపీవో శాంకుమార్ మంగళవారం పరిశీలించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు చేసిన పనులకు సంబంధించిన మాస్టర్ రోల్ ను పరిశీలించారు. ఎంపీడీవో రమేష్ మాట్లాడుతూ.. ఎండాకాలం కావున ఉపాధి హామీ కూలీలు ఉదయం తొందరగా రావాలని, ఎండలు ముదురుతున్న కొద్ది పనుల వద్ద జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. అలాగే పని ప్రదేశంలో నీటి సౌకర్యం కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్ కు సూచన చేశారు. ఉపాధి హామీ పనిలో 100 మంది కూలీలు పాల్గొనేలా చూసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్కుఎంపిడిఓ సూచన చేశారు. ఫైజాబాద్ గ్రామంలో రైతుల అవసరాల నిమిత్తం నక్షా రోడ్లను గుర్తించి, గ్రామంలో జరిగే రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకుంటే రోడ్లు నిర్మిస్తామని ఏపీఓ శాం కుమార్ తెలియజేశారు. ఉపాధి హామీ కూలీలు ఎంపీడీవోను పనిముట్లు ఇవ్వమని అడగగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆనంద్ ఏపివో శ్యామ్ కుమార్. ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్ ఉపాధి హామీ కూలీలు. పాల్గొన్నారు