

బి జె పి జిల్లా అధ్యక్షులు బైరెడ్డిప్రభాకర్ రెడ్డి
మే 6 జనంన్యూస్ వెంకటాపురం మండలం రిపోర్టార్ బట్టా శ్రీనివాసరావు
ఈరోజు వెంకటాపురం మండలంలో రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశం మేరకు,వెంకటాపురం మండలం బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో ఎవరైనా పాకిస్తానీయులు,బంగ్లాదేశీయులు,రోహింగ్యాలు,అక్రమ చొరబాటు దారులు ఉన్నారా,అని పరిశీలించి వారిని తిప్పి పంపాలని కేంద్రం ఆదేశించినందున అట్టి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతూ స్థానిక తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ నెంబర్ బొల్లె సునీల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి సాధన పల్లి విజయ్ కుమార్ యువ మోర్చాఅధ్యక్షుడు నోముల శ్రీ కిషన్, దళిత మోర్చా అధ్యక్షుడు కోయిల శీను కిసాన్ మోర్చ అధ్యక్షుడు తోట సతీష్ కుమార్ పాల్గొన్నారు.