

జనం న్యూస్ మే (6) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజక వర్గం మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్ గ్రామ అభివృద్ధి పారిశుద్ధ్యం గురించి పట్టించుకోకపోవడంతో డ్రైనేజ్ కాలువలు పూర్తిగా నుండి దుర్వాసన వెదజల్లుతున్న గ్రామపంచాయతీ సిబ్బందికి గ్రామ ప్రజలు తెలియపరిచిన గాని పట్టించుకోక పోవడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం మఱ్ఱి చెట్టు దగ్గర డ్రైనేజ్ కాలువ పూర్తిగా నుండి దుర్వాసన వస్తుంటే గ్రామ కార్యదర్శి పట్టించుకోకపోవడంతో గ్రామ ప్రజలు స్వయంగా కాలువలో ఉన్న చెత్తను తీసి పక్కన వేయడం జరిగినది. గ్రామ అభివృద్ధి మరియు పారిశుద్ధ్యం గురించి పట్టించుకొని గ్రామ కార్యదర్శి పై అధికారులు తగు చర్య తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.