Listen to this article

జనం న్యూస్ మే 6 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)


శక్తి స్వరూపిణి గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి జాతర తీర్థ మహోత్సవాలు సందర్భంగా ఈరోజు అమ్మవారి తీర్థ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది పెద జాతర కార్యక్రమంలో భాగంగా బ్రహ్మశ్రీ ఆణి విళ్ళ ఫణికాంత్ శాస్త్రి భారతి దంపతులచే అమ్మవారికి వారి ఇంటి వద్ద పాన్పు వేయడం జరిగింది. మేళ తాలాల తోటి, బాజా భజింత్రలతోటి , డబ్బు వాయిద్యాల తోటి , వివిధ కళాకారుల మధ్య, ప్రధాన ఆశాది మందపల్లి మహేష్ వారి కుమారుల ఆధ్వర్యంలో నిర్వహించి అమ్మవారికి చలివిడి పానకాలు, వివిధ రకాల పళ్ళు, స్వీట్స్ తోటి ఘనంగాపూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఆలయ అధ్యక్షులు సాయిబాబా, మరియు రామకృష్ణ పరమహంస, వారి కుటుంబ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో మరియు వర్తక సంఘాలు జాతరలు చేయించే భర్త బృందాల యొక్క సహాయ సహకారాలతో అమ్మవారి పెద జాతర కార్యక్రమం ఎంతో ఘనంగా ఆలయం వద్ద నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ వేసవిలో చలివేంద్ర కార్యక్రమం వివిధ దాతల యొక్క సహాయ సహకారాలతోటి నిర్వహించడం జరుగుతోంది.ఈరోజు రాష్ట్ర బిజెపి జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ గారు అమ్మవారిని దర్శించుకుని వచ్చును భక్తులందరికీ మజ్జిగ ని చ్చే సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.అదేవిధంగా అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా వచ్చే భక్తులకి మురళి అండ్ సన్స్ వారి యొక్క ఆర్థిక సహాయంతో పులిహార ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్త శ్రీ చెరుకు వెంకన్న బాబు గారు శీతల పానీయాన్ని రస్నాని అందజేయడం జరిగినది.అదేవిధంగా మరియొక భక్తులు య ల్లమెల్లి వారికుటుంబ సభ్యులు, కాజా గంగా ప్రసాద్, వట్టూరిదుర్గమహేష్ గారి యొక్క ఆర్థిక సహకారంతో వచ్చిన భక్తులకు గోధుమ నూక ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది.అమ్మవారి తీర్థ మహోత్సవంలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకోవడం జరిగినది.సర్వేజనా సుఖినోభవంతు