Listen to this article

జనం న్యూస్,మే06, జూలూరుపాడు: మండల

కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా, ఎల్ హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో, జూలూరుపాడు మండల ప్రెస్ క్లబ్ సీనియర్స్ ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ సీనియర్స్ నూతన అధ్యక్షునిగా కొలిపాక చంద్రశేఖర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా, ప్రెస్ క్లబ్ సీనియర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో సంచలనాత్మకమైన వార్తలను సేకరిస్తూ, ప్రజలు, అధికారుల మన్ననలను పొందుతున్న సీనియర్స్ ప్రెస్ క్లబ్ మిత్రులకు అభినందనలు తెలిపారు.ఇదే క్రమంలో ముందుకు సాగుతూ ప్రజలు, అధికారుల మనలను పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బానోత్ ధర్మ, లాకావత్ నాగేశ్వరరావు, లింగాల వీరభద్రం తోటకూరి నరేష్ పాల్గొన్నారు.