Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 9 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

పట్టణ మాజీ ఉపాధ్యక్షులు దగడ పుల్లయ్య మాట్లాడుతూ పహల్గాం దాడికి ప్రతి చర్యగా ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు విరుచుకుపడ్డాయని 26 మందికి బదులుగా 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టారని దానికి పాకిస్తాన్ దుందుడుకు చర్యగా మన పంజాబ్ అమృత్సర్ రాజస్థాన్ మొదలైన సరిహద్దు ప్రాంతాల్లో అకస్మాత్తుగా పాకిస్తాన్ మిలిటరీ వారి విమానాలతో మరియు డ్రోన్లతో దాడి చేయడానికి ప్రయత్నం చేసిందని దానిని మన భారత సైన్యం ధీటుగా తిప్పి కొట్టి గాలిలోనే వాటిని నిర్వీర్యం చేసి ఏమాత్రం మనకు నష్టం లేకుండా ఎదుర్కొన్నారని అదే సమయంలో పాకిస్తాన్లోని 12 ముఖ్య నగరాలపై కరాచీ లాహోర్ పెషవర్ లాంటి నగరాలపై కేవలం నాలుగు గంటల పాటు మెరుపు దాడి చేసి పాకిస్తాన్ కు గట్టిగా మన త్రివిధ దళ లు బుద్ధి చెప్పాయని మరలా కవింపు చర్యలు చేపట్టినట్లయితే పాకిస్తాన్ ని ప్రపంచ మ్యాప్ లో లేకుండా చేయటం భారత్ కు 24 గంటలు సరిపోతుందని తెలియజేశారు ఈ సందర్భంగా పాకిస్థాన్లో అంతర్యుద్ధం మొదలైందని అదేవిధంగా బి లువచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ సైన్యంపై ఎగతెరిపి లేకుండా దాడులు చేస్తూ దాదాపుగా రెండు నగరాలను వారి స్వాధీనంలోకి తీసుకున్నారని రాబోయే కాలంలో పాకిస్తాన్ మూడు ముక్కలవుతుందని తెలియజేశారు అంతేకాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కేవలం 24 గంటల్లో భారతదేశం తలుచుకుంటే దానిని కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటారని తెలియజేశారు ఈ సమావేశంలో ముఖ్య నాయకులు పట్టణ ఓ బి సి అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు బీసీ నాయకులు రాయుడు పంచుమర్తి పూర్ణచంద్రరావు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు