

జనం న్యూస్ మే 12
న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ ” అమ్మ మనసు” పేరుతో కార్యక్రమం అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ వాంబే కాలనీ నందు నిర్వహించినారు ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ సంస్థ అధ్యక్షురాలు కొవ్వాడ అన్నపూర్ణ, న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్ పాల్గొనగా ముఖ్యఅతిథిగా ప్రముఖ జ్యోతిష్యులు శర్మ పాల్గొని విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో ఆశ్రమంలో వృద్ధులకు ఆహ్లాదకరంగా అందిస్తూ వారి యొక్క అనుభవాలను తెలుసుకునే ప్రయత్నంతో వారితో మమైక్యమై వాళ్లు కష్టాలను వృద్ధాశ్రమంలో గడపాల్సిన పరిస్థితిలను తెలుసుకొని విద్యార్థిని విద్యార్థులు అవగాహన చేసుకుంటూ వారితో మేమున్నాము భరోసా కల్పిస్తూ సంస్థ విద్యార్థినీ విద్యార్థులు సంస్థ వ్యవస్థాపకులు వృద్ధులను ఆనందాలతో నృత్యాలు చేసేలా ప్రేరపించినారు. అనంతరం ముఖ్య అతిథి శర్మ చేతుల మీదగా చీరలు అందించి విందుకరమైన భోజనం అందించినారు ఈ కార్యక్రమంలో లోకేష్, బుజ్జి, నాని విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని తమ పిల్లలకు ఇది ఒక గొప్ప అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారని ప్రశంసించారు.