

జనం న్యూస్ 12మే భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి)
భీమారం మండలంలోని బూరుగుపల్లి నుండి గేర్రగూడెం మీదుగా దాంపూర్ వరకు రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా నిలిచి పోయింది రోడ్డు నిర్మాణం విషయంలో ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ చూపడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు కంకర పోసి వదిలి వేసిన రోడ్డు పై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వెంటనే రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు చెప్పిన ఎలాంటి స్పందన లేదు గత సంవత్సరాల క్రితం రోడ్డు పనులు ప్రారంభించి కంకర పోశారు కాగా మంజూరైన నిధులకు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మధ్యలో నే వదిలేశారు చాల కాలంగా ఒక్క గ్రామ నుండి మరొక్క గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వాలు మారిన ప్రజలకు ఇబ్బందులు మారట్లేదు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ తీసుకొని రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని రెడ్డిపల్లి ధర్మారం ఖాజిపల్లి గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు
