Listen to this article

జనం న్యూస్ మే 12 కూకట్పల్లి నియోజకవర్గం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా రాందేవరావ్ ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణ విభాగంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమైనది. నర్సులు అందించే సేవలు దైవీకమైనవి. అందువల్ల నర్సింగ్ వృత్తిని నోబెల్ ప్రొఫెషన్ అంటారు. ఈ నర్సులను సత్కరించడం అంటే దేవుడిని సత్కరించడంతో సమానం. ఇలాంటి విషయాల్లో రాందేవరావ్ ఆసుపత్రి ఎప్పుడు ముందుంటుంది. గత పది హెడు సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ నర్సింగ్ దినోత్సవాన్ని అత్యంత ఉన్నతంగా, వైభవంగా జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి లక్ష్మీ కమలాకర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి, హార్టికల్చర్ మరియు రేఖ తెరపి గ్రాండ్ మాస్టర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు. రాందేవరావ్ ఆసుపత్రిలోని నర్సులు అందరు కూడా ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్, ఒక మదర్ థెరిస్సా, ఒక సిస్టర్ నిర్మల ను ఆదర్శంగా తీసుకొని నర్సులు వాళ్ల అడుగుజాడల్లో నడవాలని మెడికల్ డైరెక్టర్ డా. కమలాకర్ అన్నారు. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెద్దల్ని గౌరవించడం అనేది ఒక ఆచారం. అందులో భాగంగా విశ్రాంతి నర్సులైన సిస్టర్స్ రాహేల్, కమల చార్లెస్, సరస్వతి ని, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ అర్చన మొరే ని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్లెడ్జ్ ను రాందేవ్ అసిస్టెంట్ నర్సింగ్ సువరింటెండెంట్ పి.శోభ రాణి అందరితో విజయవంతంగా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నర్సులను, శివానంద రిహాబిలిటేషన్ నర్సులను, కుముదుని దేవి నర్సింగ్ కాలేజ్ సిబ్బందిని, విద్యార్థినిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రి డాక్టర్లు, స్పెషల్ డాక్టర్లు, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఆసుపత్రి సీఈవో యోబు తెలిపారు.