

ఉగ్రవాద పాకిస్థాన్ ను మట్టు పెట్టకపోతే ఇండియాకు వికాసం లేదు
కలగూర రాజకుమార్
, జనం న్యూస్ 12,మే భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి )
భీమారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్ మాట్లాడుతూ మురళి నాయక్ వీరమరణం దేశం మరిచిపోలేనిదని మండల కేంద్రంలోని ప్రతి వ్యాపారస్తుల సంపూర్ణ బందుకు పిలుపునిచ్చి సంఘీభావం తెలిపారు ఇండియా పై అడుగడుగునా ఉగ్రవాదులను ఉసి గొలుపుతున్న పాకిస్థాన్ ను మట్టు పెట్టకపోతే వికసిత్ భారత్ లక్ష్యం గా దూసుకెళ్ళే ఇండియాకు వికాసం ఉండదని రెండు సార్లు పాకిస్థాన్ ను మట్టు పెట్టే అవకాశం మనకు వచ్చినా అగ్ర రాజ్యం శాంతి సయోధ్య హిత వచనాలతో అప్పటి మన కేంద్ర ప్రభుత్వ పాలకులు ఘోరమైన తప్పిదం చేశారని మేధావులు మాజీ సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు . ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ తో పాక్ ఉగ్రమూకల అంతమే లక్ష్యంగా పాకిస్థాన్ తో చేస్తున్న ధర్మ పోరాటం లో కూడా పాకిస్థాన్ ను మట్టు పెట్టే అవకాశాలు కనబడుతున్నా, మళ్లీ అగ్రరాజ్య అమెరికా హిత వచనాల తో భారత్ వెనకడుగు వేయడాన్ని మెజారిటీ దేశ ప్రజలు హర్శించలేక పోతున్నారని పాకిస్థాన్ దుష్ట కుయుక్తుల తో మళ్లీ మనం మోసపోకుండా పాక్ ఆక్రమించుకున్న ఆక్రమిత కాశ్మీర్ ను తక్షణం తిరిగి స్వాధీనం చేసుకుని పాకిస్థాన్ కు మనదేశం తగిన గుణపాఠం చెబుతేనే సీమాంతర ఉగ్రవాదానికి తెర పడుతుందని అన్నారు.19965 లో ఎంతోమంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినా దర్యంతో మన సైన్యం ముందుకు వెళ్ళి లాహోర్ కు చేరుకొని మట్టుపెట్టే అవకాశం వచ్చినా అప్పటి ప్రధాని ఆదేశాలతో వెనక్కి తగ్గామని,1971 లోపాకిస్థాన్ తో రెండోసారి 19 రోజులు మన సైనికులు యుద్ధం చేసి 99 వేల మంది పాకిస్తాన్ సైన్యాన్ని మన గ్వాలియర్ వద్ద సైనికులు బంధించి తీసుకు రాగా 3 నెలల తర్వాత అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తిరిగి పంపించి పాకిస్తాన్ ను మట్టు పెట్టే అవకాశం చెజార్చు కోవాల్సి రావడం మన భారత్ దురదృష్టకరమని అప్పుడు మట్టు బెడితే ఇప్పుడు ఈ బాధలు ఉండేవి కావని మాజీ సైనికులు వాపోతున్నారని అన్నారు. ఇండియా శాస్త్ర సాంకేతిక రంగాల్లో, అభివృద్ధిలో దూసుకు పోవడం,బలంగా ఎదగడం ఇష్టం లేని కొన్ని దేశాలు పాకిస్థాన్ ను పావుగా వాడుకొని మన పై ఉసిగొలుపుతున్నారన్నారు. పాక్ చేసే ఉగ్రవాదం పై నామ మాత్రంగా స్పందిస్తున్నారని ఇక ఎంత మాత్రం ఉపేక్షించ వద్దని హెచ్చరించారు.
1971లో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో మన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఇండియా పాకిస్థాన్ వ్యవహారాల్లో తల దూర్చితే అమెరికా నోరు మూసుకొని కోర్చిదని ఇండియా కు తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని చెప్పగా అందుకు స్పందించిన ఇందిరా గాంధీ ఇండియా అమెరికాను స్నేహితునిగా పరిగణిస్తోందని యజమానిగా కాదని తన భవితవ్యాన్ని లిఖించుకోగల శక్తి ఇండియా కు ఉందని పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసని అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కు ఇందిరా ఘాటు గా జవాబు చెప్పి భారత అమెరికా సంయుక్త పత్రికా సమావేశాన్ని ఏకపక్షంగా రద్దు చేసి వైట్ హౌస్ నుంచి దర్జాగా ఠీవి గా బయటకు వచ్చి అభివృద్ది చెందుతున్న దేశంగా ఆకృత్యాలపై పోరాడి దృఢంగా నిటారుగా ఉండే మా శక్తి ఏందో భవిష్యత్ లో ఋజువు చేస్తామని అమెరికా అధికారుల తో అనడం అప్పట్లో సంచలనం అయ్యిందని విశ్లేషకులు అంటున్నారన్నారు. ఇండియా కు చేరుకున్న తర్వాత నాటి ప్రతిక్ష నేత వాజపేయి తో ఇందిరా గాంధీ మాట్లాడి ఐక్యరాజ్యసమితి సమావేశానికి వాజపేయిని పంపి మన దేశ గళాన్ని వాజపేయి ద్వారా గలంగా వినిపించడం తో కన్నెర్ర చేసిన అమెరికా పాకిస్తాన్ ను చేరదీసి ఆర్థిక సైనిక సహాయం చేసే భారత దేశానికి అమెరికా కంపెనీల వచ్చే చమురు సరఫరాను నిలిపివేసి ఇబ్బందులకు గురి చేసినా ఇండియా వెనకడుగు వేయకుండా ఉక్రెయిన్ నుంచి చమురు సరఫరాలను జరిపించుకుంది, ఆ తర్వాత ఇండియా సొంత చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ గా రూపు దిద్దుకొని ఒక బలమైన దేశంగా ఇండియా ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ఇండియా దెబ్బకు పాకిస్థాన్ బంగ్లాదేశ్ ను కోల్పోయిందని అప్పటి నుంచి మన దేశం పై పొరుగు దేశాలు విద్వేష భావం తో మనకు పక్కలో బల్లెం గా తయారై నేటికీ విషం చిమ్ముతున్నాయని అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాకిస్థాన్ కు గట్టి బుద్ది చెప్పాలని పోలాడి డిమాండ్ చేశారు . ఇప్పుడు అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ చేసి మళ్లీ పాకిస్థాన్ మన పై దొంగ చాటుగా దెబ్బ కొట్టే కుయుక్తులు పన్నుతూనే ఉంటుందని పాకిస్థాన్ లో పాలన లేదని ఉగ్రవాదుల తో కలిసి సైనిక నియంత పాలన ఉందని జవాబు దారి తనం లేదని అమెరికా చైనా వాళ్ళ మాటలు నమ్మకుండా పాకిస్థాన్ ను మట్టు పెట్టి మన సత్తా ప్రపంచానికి చాటాలని అప్పుడే భారత్ కు దివ్య భవిష్యత్ ఉంటుందని యావత్ దేశ పౌరులు కోరుతున్నారని వెల్లడించారు.