Listen to this article

జనం న్యూస్ మే 12(నడిగూడెం)

మండలం లోని సిరిపురం క్లస్టర్ రైతు వేదిక వద్ద ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను ఏఈఓ రేణుక సోమవారం ప్రారంభించారు. రైతుల వివరాలను పోర్టల్ లో నమోదు చేసి ప్రతి రైతుకు 11 అంకెల ఫార్మర్ ఐడి కేటాయిస్తామని ఆమె తెలిపారు. దీని ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ రాయితీలు అందుతాయని చెప్పారు. రైతులు వారి పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, మొబైల్ తీసుకొని తమను సంప్రదించాలని సూచించారు.