Listen to this article

జనం న్యూస్ మే 12 కాట్రేను కొన ముమ్మిడివరం ప్రతినిధి

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో చండి హోమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం వైశాఖ మాస పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆణి వీళ్ళ ఫణికాంత్ ఆధ్వర్యంలో చెరకు మురళి దంపతుల తోపాటు సామూహికంగా భక్తులు ఈ చండీ హోమం నిర్వహించారు.
తొలుత విగ్నేశ్వరుని పూజ, అమ్మవారికి కుంకుమార్చన, పుస్తక పూజ, మరియు చండీ పారాయణం, చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అనంతరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హోమాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించి తీర్థ ప్రసాదములు స్వీకరించిరి, 18 వ చండీ హోమం సందర్భంగా అన్నసమారాధన నిర్వహించారు. . ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన ఆశా దు మందపల్లి మహేష్ , , ఆనివిల్ల సాయిబాబా, గ్రంధి నానాజీ, ,గ్రంధి ప్రసాద్, ఆనివిల్ల పవన్ సుంకర పవిత్ర కుమార్, సుంకర బుజ్జి తదితరులు పాల్గొన్నారు