

జనం న్యూస్ :13 మే మంగళవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;
మదర్స్ డే సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లలితా భవాని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దంత వైద్యురాలు విచ్చేశారు. అనంతరం తాను మాట్లాడుతూ మదర్స్ డే అనేది ఒకరోజు నిర్వహించుకునే రోజు కాదు ఒకప్పుడు పిల్లలు తల్లి తండ్రి దగ్గరే ఉండేవారు. తల్లి ఆలనా పాలనా ప్రేమ మమకారం పొందేవారు అప్పుడు వాళ్లకు అది రోజు మదర్స్ డే గానే ఉండేది.కానీ ఈ రోజుల్లో పిల్లలు ఉద్యోగాల రీత్యా దూరంగా ఉండటము, తల్లి పిల్లల మధ్య దూరం పెరగడంతో మదర్స్ డే అంటూ ఒకరోజు నిర్వహించుకుంటున్నాము అలా కాకుండా మనము ప్రతిరోజు తల్లితో కొద్ది సమయమైనా ప్రేమగా గడుపుతూ ప్రేమగా వాళ్లతో మాట్లాడుతూ ఉంటే రోజు మదర్స్ డే ని అవుతుందని, మళ్లీ అలాంటి రోజులు రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు. అనంతరం అతిథిని సన్మానించి ఈశ్వర్య కానుకను అందించారు.ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మాతృమూర్తుల గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మా కుమారీస్ వారికి చాలా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సంస్థ నిర్వాహకురాలు బి కే భావాని మాట్లాడుతూ మాతలలో ఎంతో సహన శక్తి ఉంటుందని, పిల్లలకి మొదటి గురువు అమ్మ అని, ఒక అమ్మ 100 టీచర్లతో సమానమని పెద్దవాళ్ళు మనకి చెప్తారు గుర్తు చేశారు. తల్లి పిల్లలకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది ఏ పిల్లలైతే తల్లి చెప్పిన మార్గంలో నడుచుకుంటారో వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి తల్లి పిల్లలను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. ఆ క్రమంలో తనకోసం ఏదీ కూడా ఆశించకుండా నిస్వార్ధంగా పిల్లలకి ఇచ్చేస్తుంది .ఆ భగవంతున్ని వేడుకున్నప్పుడు కూడా తన పిల్లలు బాగుండాలనే కోరుకుంటుంది. అంతిమము వరకు పిల్లల శ్రేయస్సు కోసము తన శక్తిని, సమయాన్ని, తన ధనాన్ని, చివరికి శరీరాన్ని కూడా పిల్లల సేవా కోసమే అంకితం చేస్తుందని, అలాంటి తల్లులకి సదా మనము కృతజ్ఞులై ఉండాలి, ప్రతి బిడ్డ తల్లికి గౌరవాన్ని ప్రేమని అందించాలని, బ్రహ్మా కుమారీస్ సంస్థ స్థాపకుడు ప్రజాపిత బ్రహ్మా కూడా ఈ సంస్థ యొక్క బాధ్యతలను మాతల చేతికి అందించి వందేమాతరం భారత్ మాతల యొక్క పాలనలో ఈ సంస్థ వృద్ధి జరగాలని కోరుకున్నారు. ఇప్పటికీ కూడా ఈ సంస్థ మహిళా వింగ్ ద్వారా ఎంతో మంది అమ్మలకు పిల్లల పట్ల ఉన్నటువంటి భయాన్ని తొలగించి పిల్లలని సరైన మార్గంలో నడిపించడంలో తల్లి యొక్క పాత్ర ఏంటి, పిల్లల్ని ఎలా సరిదిద్దాలి అని రాజయోగ మెడిటేషన్ ద్వారా నేర్పిస్తుందని తెలియజేశారు. అనంతరం అమ్మలందారితో కలిసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో తల్లి పాత్ర ఎంత గొప్పదో అనే విషయం పైన శివిక లహరి ,సోను, యోగి నాథ్, దియా, శ్రీకర్ పిల్లలందరూ కలిసి చిన్ననాటికను ప్రదర్శించారు, ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బి కే. స్వప్న బికే. స్రవంతి, సంస్థ సభ్యులు బిందు ఉదయ్ కుమార్ ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.