

జనం న్యూస్ జనవరి 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం లోని ముత్తన్ పేట్ లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబివృద్ధి కి ఆకర్షితులై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ శ్రీ దండే విఠల్ సమక్షంలో మాజీ ఎంపీటీసీ రవి దంపతులు టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు గ్రామ యువకులు పెద్ద మనుషులు సుమారు 150 మంది వరకు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ పేదప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని త్వరలోనే రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డు లు జారీ చేస్తుందని అన్నారు ముత్తన్ పేట్ లో నెలకొన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కౌటాల మాజీ ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్ చింతలమేపల్లి మాజీ ఎంపీపీ డుబ్బుల నానయ్య టిపిసిసి సభ్యులు అర్షాద్ హుస్సేన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాచకొండ శ్రీవార్ధన్ కాగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు