

జనం న్యూస్ మే 13 కూకట్పల్లి జోన్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ మాధవరం కాంతారావు తీవ్రంగా ఖండించారు, మంగళవారం కూకట్పల్లి అసెంబ్లీ బిజెపి కార్యాలయంలో అయన మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ పై మాట్లాడే అర్హత జగ్గారెడ్డికి లేదని, సుమారు ఐదు సంవత్సరాల క్రితం బాచుపల్లిలోని మేడికుంట ఎఫ్.టీ.ఎల్ పరిధిలో, నిర్మించిన రెండు అపార్టుమెంట్లు, ఒక కమ్యూనిటీ హాల్ వస్తుందని ఆరోపిస్తూ, ఆ అపార్ట్మెంట్ లలో నివసిస్తున్న దాదాపు యనబై కుటుంబాలను ఖాళీ చేయమని ఎం.ఆర్.ఓ. ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు వారి కుసంస్కారానికి నిదర్శనమని అన్నారు, నాడు జగ్గారెడ్డి, పిసీసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కాంతారావు గుర్తు చేశారు, కాంగ్రెస్ హైకమాండ్ సైతం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, కూరలో కరివేపాకులా తయారైన తన పరిస్థితిని నుండి బయటపడడానికే రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి జగ్గారెడ్డి ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడని దుయ్యబట్టారు, ఉద్యమ నేత ఈటెల రాజేందర్ పై నోరు జారితే సహించబోమని వాటి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంతారావు హెచ్చరించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డెపల్లి రాజేశ్వరరావు, సూర్యరావు, నాగరాజు, బిజెపి, బిజెవైయం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.