

బిచ్కుంద ఏప్రిల్ 13 జనం న్యూస్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద ప్రిన్సిపల్ కె. అశోక్ సూచన మేరకు DOST(దోస్త్) కో-ఆర్డినేటర్ డాక్టర్ జి. వెంకటేశం ఆధ్వర్యంలో కళాశాల అడ్మిషన్లు పెంపే లక్ష్యంగా అధ్యాపక బృందం ఇంటర్ పాసైన విద్యార్థుల గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రండి.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి.. అంటూ గ్రామాలలో ప్రచార కరపత్రాల తో ప్రచారం చేశారు. బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పిట్లం, బీర్కూర్,కంగ్టి, మండల కేంద్రంలోని గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కళాశాలలోనీ గ్రూపుల వివరాలు, ఎన్ఎస్ఎస్ సర్వీసులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతన అవకాశాలు ఉన్నాయని విద్యార్థులకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు విపులంగా వివరించారు.