

జనం న్యూస్,మే13, అచ్యుతాపురం:
అసంఘటితరంగ కార్మికులకు ఉచిత గుర్తింపు కార్డులు జారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగన్నాధపురం, ఎర్రవరం గ్రామంలో సుంకర వెంకటేశ్వరరావు లేబర్ ఆఫీసర్ ఎలమంచిలి పర్యటించి 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు లోపు వయసు కలిగిన ఈఎస్ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేని రంగాలు వ్యవసాయ కార్మికులు,ఉపాధి హామీ శ్రామికులు,భవన నిర్మాణ కార్మికులు,చేతి వృత్తులు, స్వయం ఉపాధి, సేవారంగం,హమాలీ, రవాణా రంగం, దుకాణాలలో పనిచేసే కార్మికులు నమోదు చేసుకుంటే ప్రమాద మరణంకు రూ. 2 లక్షలు, అంగవైకల్యంకు గురైన వారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారని, దీనికి ఆధార్ కార్డు నకలు,బ్యాంకు అకౌంట్ నెంబరు, సెల్ నెంబరు వంటి వివరాలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము కవుల రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కాండ్రేగుల. రామ సదాశివ రావు, ఉపాధి కూలీలు, కార్మికులు పాల్గొన్నారు.