Listen to this article

జనం న్యూస్, మే 14 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బుద్ధుని విగ్రహానికి J3 నాయకులు దీపారాధన నిర్వహించడం జరిగింది మరియు గౌతమ బుద్ధుని యొక్క గొప్పతనాన్ని , ప్రాచీనమైన జంబూద్వీపం నుండి తీసుకున్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సోదరా భావం, న్యాయం అనే విలువలను ప్రస్తుతం భారత రాజ్యాంగ పీఠికలో ఉన్నాయని, బుద్ధుని హృదయమే భారత రాజ్యాంగం అని కొనియాడారు. అలాగే బుద్ధుడు దేవుడు కాదు, ఆయనది మతమూ కాదు, ఆధ్యాత్మిక వాదం అంతకన్నా కాదు. బుద్ధుడు..ఒక పరిపూర్ణ మానవుడు, మానవు ల దుఃఖ నిర్మూలన కోసం సంఘాన్ని కట్టి, అంధకారం లో వున్న మనందరి కోసం మార్గదాత గా, దీప స్థంభ మై నిలిచిన వైతాళికుడు. ఆయన మనకు ఒక హేతు బద్ధమైన జీవన విధానం అందించాడు. బుద్ధుడి మార్గం లో నడవడం అంటే బుద్ధుడిని సజీవంగా నిలిపి ఉంచడమే అని నాయకులు తెలియజేశారు. యొక్క కార్యక్రమంలో జంబూద్వీప జన జాగృతి సెంట్రల్ కమిటీ మెంబర్ లింగంపల్లి భాస్కర్ మహారాజ్, మాదిగ జాగృతి సంఘం జిల్లా కన్వీనర్ వేముల మల్లికార్జున్ మహారాజ్, దీపారాధన కమిటీ ఇన్చార్జి పరమేశ్వరి మహారాణి, ధర్మ మహిళా జాగృతి నాయకురాలు నిర్మల మహారాణి, ప్రసన్న మహారాణి, బోయ పరమేశ్వరి, రాజేశ్వరి, J3 నాయకులు దేవయ్య మహారాజ్, మహేష్ మహారాజ్, రాజన్ మహారాజ్, ఫిరాజి నాయక్, ప్రవీణ్ రాజ్ మహారాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.