Listen to this article

జనం న్యూస్, మే 15 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజ పురంలో బుదవారం శ్రీ వరదరాజ స్వామిని దర్శించుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్,ఆలయ నిర్మాణానికి 10,000 విరాళం అందజేశారు. అనంతరం పుష్ప రథోత్సవం లో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి,డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, తాజా మాజీ ఎంపీపీ పాండుగౌడ్, మాజీ జడ్పీటీసీ రామచంద్రం,మాజీ వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి, లక్కాకుల నరేష్, ఆలయ ట్రస్ట్ చైర్మన్ ప్రొద్దుటూరు బాలకృష్ణ,తుమ్మ కృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు