Listen to this article

రామకోటి రామరాజు సేవలు అమోఘం అన్న మాజీ సర్పంచ్ రాములుగౌడ్

భద్రాచలం ముత్యాల తలంబ్రాలు ఎంతో పవిత్రమైనవి

జనం న్యూస్, మే 15 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాలు, కళ్యాన శేషవస్త్రాలను బుధవారం నాడు మార్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామం తాజా మాజీ సర్పంచ్ దుద్దెడ రాములుగౌడ్, లక్ష్మీ దంపతులకు వాటి పవిత్రత తెలియజేసి అందజేశారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్బంగా తాజా మాజీ సర్పంచ్ దుద్దెడ రాములు గౌడ్ మాట్లాడుతూ మేము భద్రాచలం వెళ్లలేకపోయినా కూడా మా చేతులతో ఓలిచిన గోటి తలంబ్రాలు రామకోటి రామరాజు, భద్రాచల కళ్యాణంలో అందజేసి తిరిగి భద్రాచల కళ్యాన అనంతరం రామయ్య తలంబ్రాలు మా ఇంటికి తీసుకు రావడం సంతోషంగా ఉందన్నారు. భద్రాచల తలంబ్రాలు కొన్నైనా మన ఇంటిలో ఉంటే శ్రీరామరక్ష అన్నారు. రామకోటి రామరాజు రామభక్తి అమోఘం అని కొనియాడారు. అనంతరం రామకోటి రామరాజు మాట్లాడుతూ భద్రాచల కళ్యానానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత వీరిది అన్నారు.