Listen to this article

జనం న్యూస్ మే 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)


కోదాడ ఆర్టీసీ డిపో నుండి మునగాల మండల కేంద్రము మీదుగా గణపవరం, తిమ్మారెడ్డి గూడెం, కొక్కిరేణి ,వెలిదండ , కీతవారి గూడెం మరియు హుజూర్నగర్ వరకు బస్సు సౌకర్యం లేక నాలుగు మండలాల ,రైతులు, ప్రజలు ,వృద్ధులు, వికలాంగులు విద్యార్థినీ, విద్యార్థులు వ్యాపారస్తులు ఇబ్బందులకు గురవుతున్నారని.జూన్ నెలలో కాలేజీలు,స్కూల్స్ ,ఉన్నందున విద్యార్థిని, విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని కావున తక్షణమే రెగ్యులర్ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ కి కోదాడ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆఫీసులో మునగాల మండలం కొక్కిరేణి సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. వెంటనే ఆయా గ్రామాలకు కోదాడ ఆర్టీసీ డిపో నుండి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు,పార్టీ కోదాడ టౌన్ కార్యదర్శి మిట్టగడుపుల ముత్యాలు,గ్రామశాఖ కార్యదర్శి మండల కమిటీ సభ్యులు,నందిగామ సైదులు, రేఖ లింగయ్య పాల్గొన్నారు..