Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

చిలకలూరిపేట యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ అనిల్ కుమార్

చిలకలూరిపేట మండలం లింగoగుంట గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు

ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాల గురించి బుధవారం సచివాలయం వద్ద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈకార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీవో ప్రదీప్ మాట్లాడుతూ

మండల పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కూలీలందరికీ ఈ రెండు పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అలాగే ప్రజలు వీటిని ఉపయోగించుకొని ఆర్థిక భద్రత వైపు అడుగులు వేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్య కేంద్రం చిలకలూరిపేట కౌన్సిలర్లు రవిరాజు మరియు పృథ్వీరాజు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆర్థిక అక్షరాస్యత జ్ఞానం కలిగి ఉండాలని, తద్వారా భవిష్యత్తు భరోసా అందుతుందని తమ ఆర్థిక అక్షరాస్య కేంద్రం ద్వారా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల్లో ఆర్థిక అక్షరాస్యత గురించి, బ్యాంకు సేవల గురించి, బ్యాంకు లోన్లు గురించి, బ్యాంకులో ఎదురైయేటువంటి సమస్యల పరిష్కారం గురించి అలాగే ఈ మధ్యకాలంలో పెరుగుతున్నటువంటి సైబర్ మాసాల గురించి అవగాహన మరియు చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తాము అందించేటువంటి ఎటువంటి సేవకైనా ఒక్క రూపాయి కూడా రుసుము చెల్లించిన అవసరం లేదని పూర్తి ఉచితంగా సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ , టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.