Listen to this article

జనం న్యూస్ మే 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

చత్రపతి సామాజి మహారాజ్ 368వ జయంతిని బుధవారం జేత్వాన్ బుద్ధ విహార్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ బౌద్ధమసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహోల్కర్ మాట్లాడుతూ మరాఠా రాజ్యానికి రెండవ చత్రపతి రాజు, మరియు చత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు. ఆయన రాజీ కాకుండా మంచి యోధుడు, పండితులు రచయిత, ఆలోచనపరుడు అని అన్నారు. ఆయన జీవిత కాలంలో ఒక వంద 120 యుద్ధాలు చేసి అన్నింటిలోనూ గెలుపొందాడని, దక్షిణాది రాష్ట్రాలలో మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించకుండా ఆపగలిగిన మహావీరుడని అన్నారు. శంభాజి మహారాజ్ తన రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ల వల్ల ఆయనకు రిజర్వేషన్ల పితామహుడు అని అంటారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ జిల్లా ఇన్చార్జి దుర్గం సందీప్, బీఎస్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, అంబేద్కర్, బౌద్ధ సంఘం నాయకులు దుర్గం శ్యామ్ రావు, (లహు), రాoటెంకి ప్రతాప్,రోషన్, బల్వంత్, చునర్ కార్ కిషన్,దుర్గ మనోజ్, ఉప్రే సురేందర్, దుర్గం చింటూ, స్వాగత్, పోచాలు, మారుతి, జైపాల్. వెంకటి ,వివేక్, అన్నారావు ,రమేష్, తదితరులు పాల్గొన్నారు.