Listen to this article

జనం న్యూస్ మే 15 కూకట్పల్లి జోన్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి

ఫిరోజ్ గూడ నవజీవన్ నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ విజయ గణపతి సహిత ఉమ మహేశ్వర స్వామి వార్ల దేవాలయము నందు నూతన లక్ష్మీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ఈ పుణ్యకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం రాజేశ్వరరావు ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలోని సానుకూలతను పెంపొందిస్తాయి. దేవాలయాల అభివృద్ధి ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యం అవుతుందని” అని వారు అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శంకర్ రెడ్డి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సురేందర్ రెడ్డి,బాలానగర్ బీజేపీ సీనియర్ నాయకులు రమేష్,శ్రీశైలం,శివరంజని, డివిజన్ అధ్యక్షులు డాక్టర్ కిరణ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ఇతర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.