

జనం న్యూస్ మే 15 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గురువారం ఉదయం అకాల వర్షం కురిసింది మండల పరిధిలోని పలు గ్రామాలలో ఉరుములతో మెరుపులతో భారీ వర్షం కురిసింది చిట్కుల్ చండూర్ చిలిపి చెడు గౌతాపూర్ సోమక్కపేట ఫైజాబాద్ శిలాంపల్లి కల్లాలలో కుప్పలుగా ఉన్న వరి ధాన్యం నేలపాలైంది ఐకెపి అధికారులు స్పందించి లారీలు రప్పించి తడిసిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు అకాల వర్షంతో తమకు తీరని నష్టం వాటిల్లిందని వాపోయారు అకాల వర్షం వల్ల తడిసి ముద్దయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తమకెంతో నష్టం వాటిల్లిందని ఆవేదన చెందారు సకాలంలో లారీలు వచ్చి తొందరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు తెలియజేశారు