Listen to this article

జనం న్యూస్ మే 15 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

: కాట్రేనికోన గ్రామం నందు సుమారు 33 సంవత్సరాలు నుండి విద్యార్థులు కు ట్యూషన్ చెబుతూ ఎందరో విద్యార్థులు కు మార్గ నిర్దేశం చూపిన ఎం సతీష్ మాస్టర్ ను మంగళవారం కాట్రేనికోన కు చెందిన పూర్వ విద్యార్థులు దు స్సాలువ తో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు కు ముందుస్తుగా ట్యూషన్ లు ప్రారంభించి విద్యార్థులు కు సిలబస్ ముందుగా పూర్తి చేసి టెస్ట్ లు నిర్వహిస్తూ, చదువు లో వెనుక బడిన వారిపై ప్రత్యేకంగా శ్రద్ద తీసుకోని అందరూ మంచి మార్కులు సాధించే విధంగా చేయడం లో అయన కృషి మరువ లేనిదని కొనియాడారు. ఫీజు తో నిమిత్తము లేకుండా విద్యను అందించడం ఆయన విద్యార్థులు కు ఇచ్చే ప్రాధాన్యత అని కొనియాడారు. అయన వద్ద ట్యూషన్ పొందిన ఎందరో విద్యార్థులు ఉన్నత విద్య లు పూర్తి చేసుకుని ప్రభుత్వం, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు, వివిధ రంగాలలో స్థిర పడి ఉన్నారని అయన సేవలు గుర్తు చేసుకున్నారు. సత్యమంగ, సర్వేష్, కే వెంకన్న బాబు, ఎం ఆదినారాయణ, డి వి రమణ, చింతా రాజు, కే రవి, రాజేష్ తదితరులు కార్యక్రమం లో ఉన్నారు.