

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కలగుర రాజకుమార్
జనం న్యూస్ 15 మే బీమారం మండల ప్రతినిధికాసిపేట రవి
భీమారం మండల కేంద్రంలోని ప్రెస్ మీట్ లో బి ర్ఎస్ పార్టీ అధ్యక్షులు కలగూర రాజకుమార్ మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గని అభివృద్ధికి నోచుకోకుండా విద్యకు నోచుకోకుండా ఉపాధికి నోచుకోకుండా చేసిన ఘనత వివేక్ వెంకటస్వామి కుటుంబానికె చెందుతుంది ఈ ప్రాంతం నుండి వాళ్లకు పదువులు పలుమార్లు వచ్చిన అభివృద్ధి మాత్రం శూన్యం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బిఆర్ఎస్ అధికారం లోకి వచ్చాక బాల్క సుమన్, చెన్నూర్ శాసనసభ్యులు అయ్యాక 5సంవత్సరాలు కాలంలో 2 సంవత్సరాలు కరోనా తో పోగా 3సంవత్సరాల కాలం లోనే చెన్నూర్ ని అభివృద్ధిలో పరుగులు పెట్టించిన విషయం ప్రజలందరికి తెలుసు గత ఎమ్మెల్యే బాల్కసుమన్ తెచ్చిన పనులకే భూమి పూజలు చేయడానికి 16 నెలల కాలం పట్టింది అంటే ఎంత అభివృద్ధి జరిగిందో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మనసాక్షికి తెలుసు మా ప్రాంత నిరుద్యోగులకు (40000)నలుబది వేల ఉద్యోగాలు కల్పిస్తా అని ఎన్నికల వాగ్దానలు చేసిన విషయం మీకు గుర్తు చేస్తున్నాము మీ అధినేత రాహుల్ గాంధీ. నియోజకవర్గం లో కంపెనీలు ఓపెన్ చేసి అక్కడ ఉపాధి కల్పిస్తున్నరు కానీ చెన్నూర్ ప్రజలకు ఇచ్చిన మాట మాత్రం మర్చి పోయిండ్లు మా ప్రాంత ప్రజలను మోసం చేసిండ్లు అనేది వాస్తవం కాద, భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామంలో బాల్కసుమన్ హయాంలో సబస్టేషన్ తీసుకస్తే భూమి పూజ చేసి నెలలు గడుస్తున్న పనులు మాత్రం నడుస్తలేవు ఇది మీకు మా ప్రజల పైన ఉన్న చిత్తశుద్ధి కి నిదర్శనం ప్రశ్నినిస్తే కేసులు పెట్టె సంస్కృతి తీసుకచ్చి పబ్బం గడపాలని చూస్తే చెన్నూర్ ప్రాంత ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరు తెలివి పెరిగింది చైతన్య వంతులు అయ్యిండ్లు మా చెన్నూర్ ఎనుకటి ఎడ్డీ గుడ్డి కాలం లో లేదు అన్న విషయం గమనించాలని ఆరోపించారు,