Listen to this article

రాము (బి.ఎస్.ఎఫ్.ఐ) నాయకులు

జనం న్యూస్, మే 16 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

బి.ఎస్.ఎఫ్.ఐ నాయకుడు ఆర్ టి ఈ వినతిపత్రం అందిస్తూ విద్య వ్యవస్థ గురించి ఈ విధంగా పేర్కొన్నారు,
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి విద్యారంగం పరిస్థితి దారుణంగా తయారయింది. కే.సీ.ఆర్ హయంలో విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ పాలన కొనసాగించాడు. విశ్వవిద్యాలయాల మెరుగైన ర్యాంకులు పడిపోవడం, ప్రభుత్వ కాలేజీల్లో ,పాఠశాలల్లో సరైన సదుపాయాలు అందించకపోవడం , నూతన కార్పొరేట్ పాఠశాలలకు మరియు కాలేజీలకు అడ్డగోలుగా పరిమిషన్లు అనుమతులు ఇవ్వడం ఇలా పూర్తిగా విద్యని ప్రైవేటుపరం చేశారు. దారుణంగా గత ఐదు సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ రాక విద్యార్థులు పడని బాధ లేదు. ఇన్ని జరుగుతున్న గాని గత ప్రభుత్వంకు మరియు నూతన ప్రభుత్వానికి కొంచెం కూడా విద్యపై పట్టింపు లేకుండా పోయింది. అందుకే బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులుగా మేము క్షేత్రస్థాయి నుండి ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేస్తున్నాం. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ ని కలిసి విద్యా హక్కు చట్టం RTE 12(1)(C) ద్వారా అన్ని ప్రయివేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ లో ఉచిత అడ్మిషన్లు అయ్యేలా చొరవ తీసుకోవాలని చెప్పారు.
•G.O.Ms.No.91 Dt:6-8-2009 జీవోలోని సెక్షన్ 12.(1)(C) ప్రకారం పాఠ్యపుస్తకాలు,స్టేషనరీ, యూనిఫాంలను స్కూల్ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న ఖచ్చితమైన నిబంధనలేమి పెట్టరాదు, అయినా వీటి అమ్మకాలకు పాఠశాలలల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు, ఏర్పాటు చేయకుండా చూడండి.పాఠశాల యజమాన్యాలు సూచించిన చోటు కొనకుండా చూడండి. C&DSE Proc Rc. No.780 Dt:16-5-2013 సెక్షన్ 8(1) ప్రకారం పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్ ఐఐటి,ఒలంపియాడ్,కాన్సెప్ట్,ఈటెక్నో అనే తోకలు తగిలించినవి,తొలగించాలి.. అలాంటి తోకలు ఉంటే వాటి గుర్తింపును రద్దు చేయండి.
G.O.Ms.No.1 Dt:1-1-1994 ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి అనే అంశం. వసూలు చేసిన ఫీజుల్లోంచి 50% మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలి అనే అంశం పై సమగ్ర విచారణ చేయాలీ. ప్రతి ఏడాది వార్షికనివేదికలు, ఆడిట్ రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించలేని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలన్నారు.అధిక ఫీజుల నియంత్రణ చేపట్టాలి , ఆన్లైన్ ఫీజులు అంటూ అదనంగా వసూళ్లను ఆపేయాలని అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తో బోధన జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లాలని వెంకటేశ్వర్ రెడ్డి (అసిస్టెంట్ డైరెక్టర్ ) సిద్దిపేట జిల్లా ని కలసి వినతిపత్రం అందించారు. బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి శర్ధని రాము, బహుజన గాయకుడు నవీన్. తెలియజేశారు.