

జనం న్యూస్;15 మే గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;
మే 17 శనివారం రోజున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ సిద్దిపేటకు సంబంధించి ఎన్నికలు కలవని శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ ఎన్నికల అధికారి చింతల బాల్ నర్సయ్య యాదవ్ తెలిపారు. శ్రీ కృష్ణ యాదవ్ ఫంక్షన్ హాల్ సిద్దిపేటలో సభ్యత్వం ఉన్న ప్రతి సభ్యులు హాజరై ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంటల లోపు ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. మధ్యాహ్నం కౌంటింగ్ తో పాటుగా అదే రోజు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మామిండ్ల ఐలయ్య యాదవ్, పయ్యావుల ఎల్లం యాదవ్, ఉండ్రాళ్ల రాజేశం యాదవ్, బైరి అనీల్ కుమార్ యాదవ్, జక్కుల రాజేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.