

జనం న్యూస్,మే15,అచ్యుతాపురం:
అచ్యుతాపురం శాఖ గ్రంధాలయంలో ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా వేసవి శిబిరాల శిక్షణలో విద్యార్థులకు తెలుగు ఛందస్సు చెప్పటానికి రిసోర్స్ పర్సన్ గా అచ్యుత స్కూల్ తెలుగు మాస్టర్ ఆర్ సత్యనారాయణ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ తెలుగులోఉన్న అక్షరాలలో పొట్టి అక్షరాలకు,పొడుగు అక్షరాలకు గల భేదాల గురించి వివరించడం జరిగింది అని, భాషలు అన్నిటికన్నా తెలుగు భాష అతి కష్టమైనదని, అక్షరాలలో ప్రతి అక్షరానికి దీర్ఘాలు కానీ వత్తులుగా కలపని ఎడల ఆ పదానికి భావమే మారిపోతుంది అన్నారు. ఆంగ్ల భాష కన్నా తెలుగు భాష అరుదైనదని, అతికష్టమైనది తెలిపారు. స్థానిక లైబ్రేరియన్ డి కోటేశ్వరరావు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.