Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఎస్టీయు


రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు రాష్ట్ర ఆర్ధిక కార్య దర్శి కే కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు చిలకలూరిపేట పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులపై ఉపాధ్యాయ సంఘాలు కోరిన అంశాలను పరిగణలు తీసుకోవాలని ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలని ఎస్టీయూ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు హైస్కూల్స్ లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:45 గా పాటిస్తే స్కూల్ అసిస్టెంట్ లు ఎక్కువ మిగులు కారు. వీరిని ప్రాథమిక పాఠశాలకు పంపడం తిరోగమన చర్య అవుతుందని తెలిపారు ప్రాథమిక పాఠశాలలో డీఎడ్ పూర్తి చేసిన వారిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం సరికాదని తెలిపారు, SA లను మోడల్ ప్రైమరీ స్కూల్స్ కు పంపకుండా SGT లకు పదోన్నతులు ఇవ్వడం ద్వారామెగా DSC కి పోస్ట్లు ఎక్కువ వచ్చి ప్రభుత్వం కూడా నిరుద్యోగ ఉపాధ్యాయులకు మేలు చేసిన వారు అవుతారనితెలిపారు.
ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారిన వెబ్ కౌన్సిలింగ్ (.ఆన్లైన్ కౌన్సిలింగ్) లో ఇబ్బందులు ఎక్కువ కాబట్టి మాన్యూవల్ కు అవకాశం ఇవ్వాలని ఎస్టీయూ పక్షాన డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు వీటన్నిoటిపై రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ( CSE) చొరవ చూపాలని తెలియజేయడం జరిగింది.. లక్షకు పైగా ఉపాధ్యాయులు విద్యాశాఖ మంత్రిస్థాయి లోనే ఈ సమస్యలకు పరిష్కారం అవుతాయి కాబట్టి విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ వెంటనే జోక్యం చేసుకోవాలని ఎస్టీయూ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా 1953లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మీడియం పాఠశాల లేకుండా, అన్ని పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, ఒరియా మీడియం, తమిళ్ మీడియం, కన్నడ మీడియం ఉండడం ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.కావున సమాంతరంగా తెలుగు మీడియం పాఠశాలల కొనసాగించాలని కోరారుఎస్ టి యు పల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య ఎస్ టి యు పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి వి జయప్రకాష్ నాదెండ్ల మండల అధ్యక్షుడు మక్బూల్ బాషా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ ఎడ్లపాడు మండల అధ్యక్షుడు జి కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ చిలకలూరిపేట మండల అధ్యక్షులు బొంత రవి చిలకలూరిపేట మండల ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్వలి ఎస్టియు సీనియర్ నాయకులు చావల మల్లేశ్వరరావు జిల్లా మహిళా కన్వీనర్ ఎం శారద తదితరులు పాల్గొన్నారు