Listen to this article

జుక్కల్ ఏప్రిల్ 15 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం హసన్ టాక్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన గురువారం నాడు అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక డంపులను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు . ఇట్టి సీజ్ చేసిన ఇసుక డంపులను 16.5.2025 నాడు 11:30 గంటల నిమిషాలకు వేలంపాట నిర్వహించడం జరుగుతుందని రెవిన్యూ అధికారులు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇట్టి అవకాశాన్ని డోంగ్లి మండలంలోని గ్రామ ప్రజలు ఈ వేలంపాటలో పాల్గొని అవసరం ఉన్నవాళ్లు ఇసుక తీసుకోగలరని రెవెన్యూ అధికారులు కోరడమైనది.