

పలుగు,పారా,తట్టను పట్టిన కలెక్టర్ జితీష్ పాటిల్.
జనం న్యూస్,మే15,జూలూరుపాడు:
మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా పర్యటించారు.మాచినేనిపేట తండా, పడమట నర్సాపురం, మాచినేనిపేట, జూలూరుపాడు గ్రామాలలొ ఇంకుడు గుంటల నిర్మాణ పనులను,ఉపాధి హామీ పనులను పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడిన కలెక్టర్ ఉపాధి కూలీల సమస్యల తెలుసుకొని,సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపడతామన్నారు. మాచినేనిపేట, గోపా తండా గ్రామంలో మునగ తోటను పరిశీలించి అనంతరం ముంగతోట తక్కువ ఖర్చు, తొందరగా దిగుబడి మరియు మంచి లాభం వస్తుంది కాబటి ప్రతి రైతు కూడా ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఇతర పంటలకు పెట్టుబడికి సహాయంగా ఉండే విధంగా తక్కువ పెట్టుబడి తొందరగా దిగుబడి వచ్చే పంటలు సాగు చెయ్యాలని సూచించారు. జూలూరుపాడు మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి,ఆ పాఠశాలలో జరిగే సమ్మర్ స్పోర్ట్స్ పరిశీలించారు అనంతరం ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి విద్యాచందన,ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఏవో దీపక్ ఆనంద్, ఎంపీఓ తులసీరామ్, ఏపీఎం సత్యనారాయణ రాజు, ఏపీవో రవికుమార్ తదుతరులు పాల్గొన్నారు.